Friday, December 19, 2008

ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు.....

మల్లేశ్వరి-(1951)
సంగీతం : సాలూరి రాజేశ్వర రావు
రచన : దేవులపల్లి
పాడినవారు :భానుమతి,ఘంటసాల

పల్లవి : ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు దేశదేశాలన్ని తిరిగిచూసేవూ
ఏడతానున్నాడో బావా ఏడతానున్నాడో బావా
జాడ తెలిసిన పోయిరావా
అందాల ఓ మేఘమాలా అందాల ఓ మేఘమాలా

చరణం : గగనసీమల తేలు ఓ మేఘమాలా
మా వూరు గుడి పైన మసలి వస్తున్నావా
మల్లి మాటేదైనా నాతో మనసు చల్లగా చెప్పి పోవా
నీలాల ఓ మేఘమాలా రాగాల ఓ మేఘమాలా

చరణం : మమతలెరిగిన మేఘమాలా
మమతలెరిగిన మేఘమాలా
నా మనసు బావకు చెప్పిరావా
ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతోరేపవలు
ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతోరేపవలు
ఎదురుతెన్నులు చూచెనే ఎదరి కాయలు కాచెనే
అందాల ఓ మేఘమాలా రాగాల ఓ మెఘ మాలా

చరణం : మనసు తెలిసిన మేఘమాలా మరువలేనని చెప్పలేవా
మల్లితో మరువులేవని చెప్పలేవా
కళ్ళు తెరచిన గానీ కళ్ళుమూసినగానీ
కళ్ళు తెరచిన గానీ కళ్ళుమూసినగానీ
మల్లిరూపే నిలిచనే నా చెంత మల్లి మాటే పిలిచెనే

జాలిగుండెల మేఘమాలా బావ లేనిదే బ్రతుకజాలా
జాలిగుండెల మేఘమాలా
కురియునాకన్నీరు గుండెలో దాచుకుని వానజల్లుగ కురిసిపోవా
కన్నీరు వాన వాలుగా బావ ఏలా

No comments: