Thursday, March 17, 2011

శశిరేఖా పరిణయం

ఏదో వప్పుకోనంది నా ప్రాణం

సంగీతం: విద్యాసాగర్,మణి శర్మ
రచన : సిరివెన్నెల
గానం: సైంధవి

ఏదో ….వప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో .... చెప్పనంటోంది నా మౌనం

ఉబికి వస్తుంటే సంతోషం, అదిమిపెడుతోందే ఉక్రోషం
తన వెనుక నేనూ, నా వెనుక తానూ
ఎంతవరకీ గాలి పయనం అడగదే ఉరికే ఈ వేగం

ఎదో ఎదో ఏదో వప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో చెప్పనంటోంది నా మౌనం

ముల్లులా బుగ్గను చిదిమిందా ,మెల్లగా సిగ్గును కదిపిందా
వానలా మనసును తడిపిందా ,వీణలా తనువును తడిమిందా -2

చిలిపి కబురు ఏం విందో, వయసుకేమి తెలిసిందో-2
ఆదమరుపో , ఆటవిడుపో , కొద్దిగా నిలబడి చూద్దాం….ఓ క్షణం

అంటే …. కుదరదంటోంది నా ప్రాణం
కాదంటే …. ఎదురు తిరిగింది నా హృదయం
---------------------------------------------------------------

సంగీతం: విద్యాసాగర్,మణి శర్మ
రచన :అనంత శ్రీరాం
గానం: సైంధవి

ఏదో …. వప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో ... చెప్పలేనంది ఏ వైనం
కలతపడుతుందే లోలోనా ,కసురుంటుందే నా పైనా
తన గుబులు నేనూ ,నా దిగులు తానూ
కొంచెమైనా పంచుకుంటే తీరిపోతుందేమో భారం

ఎదో ఎదో ఏదో వప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో చెప్పలేనంది ఏ వైనం

పచ్చగా ఉన్నా పూదోటా , నచ్చడం లేదే ఈ పూటా
మెచ్చుకుంటున్నా ఊరంతా, గిచ్చినట్టుందే నన్నంతా -2

ఉండలేను నెమ్మదిగా ,ఎందుకంటే తెలియదుగా
ఉండలేను నెమ్మదిగా ,ఎందుకంటే తెలియదుగా
తప్పటడుగో ,తప్పు అనుకో
తప్పదే తప్పుకు పోదాం ….తక్షణం

అంటూ అడ్డుపడుతుంది ఆరాటం
పదమంటూ నెట్టుకెడుతోంది నను సైతం

No comments: