Friday, April 3, 2009

గులాబి

ఏ రోజైతే చూసానో నిన్ను....

సంగీతం : శశి ప్రీతం
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : శశి ప్రీతం

పల్లవి : ఏ రోజైతే చూసానో నిన్ను..
ఆ రోజే నువ్వయిపొయా నేను
కాలం కాదన్నా ఏదూరం అడ్డున్నా నీ ఊపిరినై నే జీవిస్తున్నాను
నీ స్పర్శే ఈ వీచే గాలుల్లొ ..నీ రూపే నా వేచే గుండెల్లో
నిన్నటి నీ స్మృతులే నన్ను నడిపిస్తూ ఉంటే
ఆ నీ నీడై వస్తాను ఎటువైపున్నా

నీ కష్టం లో నేను ఉన్నాను
కరిగే నీ కన్నీరౌతా నేను
చెంపల్లో జారి నీ గుండెల్లో చేరి నీ ఏకాంతంలో ఓదార్పౌతాను

చరణం : కాలం ఏదో గాయం చేసింది
నిన్నే మాయం చేసానంటోంది
లోకం నమ్మి అయ్యో అంటోంది
శోకం పిండి జో కొడతానంది
గాయం కోస్తున్నా నే జీవించే ఉన్నా
ఆ జీవం నీవని సాక్షం ఇస్తున్నా
 
ఆఆ ..నీతో గడిపిన ఆ నిముషాలన్ని
నాలో దాగే గుండెల సవ్వడులే
జరిగే వింతే నే నమ్మేదెట్టాగా
నువు లేకుంటే నేనంటు ఉండనుగా

నీ స్పర్శే ఈ వీచే గాలుల్లొ ..నీ రూపే నా వేచే గుండెల్లో
నిన్నటి నీ స్మృతులే నన్ను నడిపిస్తూ ఉంటే
ఆ నీ నీడై వస్తాను ఎటువైపున్నా
నీ కష్టం లో నేను ఉన్నానుకరిగే నీ కన్నీరౌతా నేను
చెంపల్లో జారి నీ గుండెల్లో చేరి నీ ఏకాంతంలో ఓదార్పౌతాను

No comments: