Saturday, April 5, 2008

ఏ దివిలో విరిసిన పారిజాతమో...(కన్నెవయసు)

ఏ దివిలో విరిసిన పారిజాతమో...

గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం
సంగీతం: సత్యం
రచన : దాశరధి

పల్లవి : ఏ దివిలో విరిసిన పారిజాతమో..ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
నా మదిలో నీవై నిండిపోయెనే...
ఏ దివిలో విరిసిన పారిజాతమో..ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో

నీ రూపమే దివ్యదీపమై
నీ నవ్వులే నవ్యతారలై
నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే

ఏ దివిలో విరిసిన పారిజాతమో..ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో

చరణం : పాలబుగ్గలను లేతసిగ్గులో పల్లవించగా రావే
నీలిముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే
కాలి అందియలు ఘల్లుఘల్లుమన రాజహంసలా రావే

ఏ దివిలో విరిసిన పారిజాతమో..ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో

చరణం : నిదురమబ్బులను మెరుపుతీగవై కలలు రేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయరాగములు ఆలపించినది నీవే
పదము పదములో మధువులూరగా కావ్యకన్యవై రావే

ఏ దివిలో విరిసిన పారిజాతమో..ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో

No comments: